టీటీడీ ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ అధ్యక్షతన జరిగిన నాదనీరాజనం కళాబృందాల ఎంపిక కమిటీ సమావేశం

తిరుపతిలోని ఎస్‌వీబీసీ ఛానెల్ కార్యాలయంలో మంగళవారం నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాల ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ అధ్యక్షత వహించారు.

కళా, సాంస్కృతిక రంగాల్లో నిపుణులైన సెలెక్షన్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాదనీరాజనం కార్యక్రమం కోసం ఎస్‌వీబీసీకి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. కళాబృందాలు పంపిన వీడియోలను వీక్షించి, వారి ప్రతిభ, ప్రదర్శన స్థాయి, కార్యక్రమానికి అనుకూలతను పరిశీలించారు.

అక్టోబర్, నవంబర్ నెలల్లో నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్న కళాబృందాలను కమిటీ ఎంపిక చేసింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కళాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చించారు.

సెలెక్షన్ కమిటీ సభ్యులు:

  1. శ్రీ బి. శ్రీధర్ వర్మ – చైర్మన్, ఎస్‌వీబీసీ, టీటీడీ
  2. పద్మశ్రీ కన్యాకుమారి అవసరాల – వయోలిన్ విద్వాంసురాలు, చెన్నై
  3. పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ – భరతనాట్యం కళాకారిణి, హైదరాబాద్
  4. శ్రీ వేదాంతం రాధేశ్యామ్ – కూచిపూడి కళాకారుడు, కూచిపూడి
  5. శ్రీ ముడిగొండన్ ఎస్.ఎన్. రమేష్ – వీణ విద్వాంసుడు, చెన్నై
  6. పం. కైవల్య కుమార్ గురవ్ – హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు, ధార్వాడ్
  7. శ్రీ నందకిశోర్ కపోటే – కథక్ కళాకారుడు, పుణే
  8. ఎస్‌వీ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్
  9. ఎస్‌వీబీసీ కన్వీనర్

సమావేశం అనంతరం వివిధ కళా రంగాల్లో నిపుణులైన సెలెక్షన్ కమిటీ సభ్యులను ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ గారు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Related Articles

Latest Articles