ట్విట్టర్ లో 6 మిలియన్ మైలురాయిని దాటిన కింగ్ అక్కినేని నాగార్జున

కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో యక్టి వ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా నాగార్జున ట్విట్టర్లో ఒక మైలురాయిని చేరుకున్నారు, ట్విట్టర్లో ఆయన అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కు ను దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీ కి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి, నాగ్ తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కంటే, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోయర్స్ తో వాళ్లకి కాంపిటీషన్ ఇస్తున్నారు.

సుదీర్ఘ గ్యాప్ తరువాత, నాగార్జున బాలీవుడ్లో బిగ్ బడ్జెట్ ఫాంటసీ డ్రామా బ్రహ్మాస్త్రా సినిమాలో నటిస్తున్నారు , ఇందులో అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.