BREAKING: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలోని థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దీనిపై ఏపీ ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ కూడా రాసింది. ఈ క్రమంలో తాజాగా థియేటర్లలో 100 శాతం సీటింగ్ సామర్థ్యంకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

100 PERCENTAGE IN TELANGANA

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో తెలిపింది. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై టాలీవుడ్ సినీ పరిశ్రమ వర్గాలు, థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం గత కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.