టాలీవుడ్‌కి కొత్త కళ: ఒకేరోజు 10 సినిమాలు రిలీజ్

లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కావడం, థియేటర్లు ఓపెన్ కావడంతో టాలీవుడ్‌‌కు కొత్త కళ వచ్చేసింది. లాక్‌డౌన్ తర్వాత వరుస పెట్టి సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. గత ఏడాది విడుదల కావాల్సిన సినిమాలన్నీ లాక్‌డౌన్ వల్ల ఆగిపోవడంతో… ఆ సినిమాలన్నీ ఈ ఏడాది విడుదల కానున్నాయి. భారీగా సినిమాలు వస్తుండటంతో.. మేకర్స్ ఇప్పటినుంచే రిలీజ్ డేట్‌లను ప్రకటిస్తున్నారు.

1O CINEMAS RELEASE

ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఏకంగా 10 సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. జాంబీ రెడ్డి’ ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావ’ ‘జి-జాంబీ’ ‘జై మరియమ్మ’ ‘నాతో ఆట’ ‘ప్రణవం’ ‘రాధాకృష్ణ’ ‘జర్నలిస్ట్’ ‘విట్టల్ వాడి’ సినిమాలు ఫిబ్రవరి 5న విడుదల కానున్నాయి. ఇందులో తేజ సజ్జా నటించిన జాంబీ రెడ్డి సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘అ!’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంపై.. దీనిపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.