వైరల్.. కొత్త లుక్‌లో సన్నీలియోన్

బాలీవుడ్ నటి సన్నీలియోన్ తిరిగి ఆరు నెలల తర్వాత ముంబైకి చేరుకుంది. ఫ్లైట్‌లో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులను సన్నీ పంచుకుంది. నల్లటి రంగు మార్చుకుని ధరించి నీలిరంగు కార్డిగాన్ మ్యాచింగ్ జాకెట్‌తో ఈ ఫొటోలో సన్నీలియోన్ కలినిపించింది. కూల్ షేడీ గ్లాసెస్ పెట్టుకుని ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.

6 నెలల తర్వాత తిరిగి సొంత ఇంటికి వచ్చాను. ఇదో కొత్త సాహసం అని సోషల్ మీడియాలో సన్నీ పోస్ట్ పెట్టింది. దీనిని చూసిన అభిమానులు వెల్‌కమ్ టూ ఇండియా అని కామెంట్ చేస్తున్నారు.

మే నెలలో భర్త డేనియల్ వెబెర్, పిల్లలతో కలిసి అమెరికాలోని తన అత్తవారి ఇంటికి వెళ్లింది. చాలా నెలల తర్వాత సన్నీలియోన్ తిరిగి రావడంతో ఏదైనా సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిందేమోనని చెబుతున్నారు. ప్రస్తుతం సన్నీలియోన్ కొన్ని సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తోంది.